2.0 మరియు PSLV-C43... రెండూ ఒకేసారి, శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్(Video)

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (16:11 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఇస్రో చైర్మన్ శివన్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో శివన్‌కు వేదపండితులు వేదశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. 
 
అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ...  పీఎస్‌ఎల్‌వీ-సీ43 విజయవంతం కావాలని కోరుకున్నట్లు తెలిపారు. కాగా ఈ రాకెట్ రేపు ఉదయం గం. 9.58 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. మొత్తం 31 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సి43 రాకెట్‌ కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. మన దేశానికి చెందిన హైసిస్‌ ఉపగ్రహం, యూఎస్‌కు చెందిన 23 ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. కాగా రేపే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.O చిత్రం కూడా విడుదల కాబోతోంది. ఈ చిత్రం రాకెట్‌లా దూసుకెళ్తుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments