Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యది ఆత్మహత్యా? హత్యా?: పోలీసులకు కన్నా కుమారుడు ఫిర్యాదు

Webdunia
శనివారం, 25 జులై 2020 (10:21 IST)
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక అనుమానాస్పద మరణంపై ఆయన కుమారుడు ఫణీంద్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన సైబరాబాద్‌ పోలీసులకు  ఫిర్యాదు చేశారు.

తన భార్యకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని చెప్పారు. ఆమె చనిపోయిన రోజున డ్రగ్‌ పార్టీ జరిగిందని, ఆ పార్టీలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నారని, వారంతా ఘటనా స్థలం నుంచి పారిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు.

సిబిఐటి వద్ద ఉన్న ఫాంహౌస్‌‌లో తన భార్య చనిపోయిందంటూ తొలుత చెప్పారని, ఆ తర్వాత మాట మార్చారని చెప్పారు. తన భార్యది ఆత్మహత్యా లేక హత్యా అనే విషయాన్ని తేల్చాలని పోలీసులను కోరారు. తన తోడల్లుడితో తమకు ఆర్థిక వివాదాలు ఉన్నాయని ఫణీంద్ర తెలిపారు.

ఆరోజు పార్టీలో పాల్గొన్న వారంతా తప్పించుకు తిరుగుతున్నారని చెప్పారు. సిబిఐటి వద్ద ఆమె చనిపోయిందని వారు చెప్పారని, ఆ తర్వాత మీనాక్షి మ్యాన్షన్‌లో జరిగిందని రాయదుర్గం సిఐ దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు.

స్థలం గురించి అబద్దాలు చెప్పడం వల్లే తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. తన భార్య చనిపోయిన రోజు జరిగింది పార్టీ కాదని, తమ మధ్య ఉన్న ప్రాపర్టీ వివాదాలపై మాట్లాడటానికి ఆమె వెళ్లిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments