Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యది ఆత్మహత్యా? హత్యా?: పోలీసులకు కన్నా కుమారుడు ఫిర్యాదు

Webdunia
శనివారం, 25 జులై 2020 (10:21 IST)
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక అనుమానాస్పద మరణంపై ఆయన కుమారుడు ఫణీంద్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన సైబరాబాద్‌ పోలీసులకు  ఫిర్యాదు చేశారు.

తన భార్యకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని చెప్పారు. ఆమె చనిపోయిన రోజున డ్రగ్‌ పార్టీ జరిగిందని, ఆ పార్టీలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నారని, వారంతా ఘటనా స్థలం నుంచి పారిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు.

సిబిఐటి వద్ద ఉన్న ఫాంహౌస్‌‌లో తన భార్య చనిపోయిందంటూ తొలుత చెప్పారని, ఆ తర్వాత మాట మార్చారని చెప్పారు. తన భార్యది ఆత్మహత్యా లేక హత్యా అనే విషయాన్ని తేల్చాలని పోలీసులను కోరారు. తన తోడల్లుడితో తమకు ఆర్థిక వివాదాలు ఉన్నాయని ఫణీంద్ర తెలిపారు.

ఆరోజు పార్టీలో పాల్గొన్న వారంతా తప్పించుకు తిరుగుతున్నారని చెప్పారు. సిబిఐటి వద్ద ఆమె చనిపోయిందని వారు చెప్పారని, ఆ తర్వాత మీనాక్షి మ్యాన్షన్‌లో జరిగిందని రాయదుర్గం సిఐ దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు.

స్థలం గురించి అబద్దాలు చెప్పడం వల్లే తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. తన భార్య చనిపోయిన రోజు జరిగింది పార్టీ కాదని, తమ మధ్య ఉన్న ప్రాపర్టీ వివాదాలపై మాట్లాడటానికి ఆమె వెళ్లిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments