సాయి ధరమ్ తేజ్ రాష్ డ్రైవింగ్ పై కేసు నమోదు

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (13:28 IST)
హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసారు. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద కేసును పోలీసులు నమోదు చేసారు. ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద సాయి ధరమ్ తేజ్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. 
 
హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ పై వేగంగా డ్రైవ్ చేస్తుండ‌గా, శుక్ర‌వారం రాత్రి 8 గంటల 5 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సీసీ పుటేజీ రికార్డుల్లో నమోదయినట్లు పోలీసులు తెలిపారు. సీసీ పుటేజీ ఆధారంగా రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో స్పోర్ట్స్ బైక్‌‌‌ను ( ట్రంప్) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదం గురించి పోలీసులకు 108 సిబ్బంది తెలియజేశారు. 
 
అప్ప‌టిక‌పుడు హుటాహుటిన సాయిధ‌ర‌మ్ తేజ్ ను ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అయితే, అప్ప‌టికే ఆయ‌న అప‌స్మార‌క స్థితిలో ఉన్న‌ట్లు, ఛాతి వ‌ద్ద‌, మ‌రికొన్ని చోట్ల గాయాలున్న‌ట్లు చెపుతున్నారు. ప్ర‌మాదం సమ‌యంలో సాయి ధ‌ర‌మ్ తేజ్ ధ‌రించిన హెల్మెట్ దూరాన ప‌డి ఉండ‌టం గ‌మ‌నించారు. హెల్మెట్ ధ‌రించి ఉండ‌టం వ‌ల్ల ప్రాణ న‌ష్టం త‌ప్పింద‌ని, బండి స్కిడ్ అయి ఈ ప్ర‌మాదం జ‌రిగ‌న‌ట్లు చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments