Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎందుకు కొట్టాడో తెలీదు... ప‌రువు పోయిందంటూ అమ్మాయి ఆత్మ‌హ‌త్య‌

అన‌కాప‌ల్లి: తోటి విద్యార్థి తనను కొట్టాడనే మనస్తాపంతో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోని మళ్లవీధికి చెందిన మళ్ల ధరణి (17) పట్టణంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌

Webdunia
బుధవారం, 29 జూన్ 2016 (14:07 IST)
అన‌కాప‌ల్లి: తోటి విద్యార్థి తనను కొట్టాడనే మనస్తాపంతో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోని మళ్లవీధికి చెందిన మళ్ల ధరణి (17) పట్టణంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మంగళవారం రాత్రి సమయంలో ఇంటి వద్ద ఉరి వేసుకుంది. కుటుంబీకులు గమనించేసరికి మృతి చెందింది. 
 
ఈమె చేతిలో ఉన్న ఉత్తరాన్ని కుటుంబీకులు పట్టణ పోలీసులకు అప్పగించారు. అందులో ఆమె రాసిన వివరాల ప్రకారం... కళాశాలలో గణేష్‌ అనే తోటి విద్యార్థి తనను కొట్టాడని, ఎందుకు తనను కొట్టాడో తెలియదని రాసి ఉంది. ఈ విషయంలో తన తప్పు ఉన్నట్లుగా ఉపాధ్యాయులు భావిస్తుండటాన్ని భరించలేక తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది. కొద్ది రోజులుగా ఈ విద్యార్థిని కళాశాలకు వెళ్లడం లేదు. కుమార్తె ఆత్మహత్యతో తల్లిదండ్రులు శ్రీనివాస్‌, ఆదిలక్ష్మీలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పట్టణ క్రైం ఎస్సై అల్లు వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya: సూర్య రెట్రో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో తీసుకువస్తోంది

ఆస్ట్రేలియాలో సెక్యురిటీ గార్డ్ కూడా బీఎండబ్ల్యూ ఉంటుంది : విరాజ్ రెడ్డి చీలం

Akshay Kumar : కన్నప్ప ఆఫర్ రెండు సార్లు తిరస్కరించాను.కానీ...: అక్షయ్ కుమార్

చరిత్ర సృష్టించి 13 వారాల పాటు ట్రెండ్ అయిన లక్కీ భాస్కర్ చిత్రం

కోలీవుడ్‌లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్న పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments