Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పరీక్షల షెడ్యూల్ : వేసవిలో ఇంటర్ ఎగ్జామ్స్

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (08:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఇందులోభాగంగా, వేసవిలో ఇంటర్ పరీక్షలను నిర్వహించనుంది. ముఖ్యంగా, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఇంటర్ తరగతులు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. ​ఈ వేసవిలో మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 5 నుంచి 22వ తేదీ వరకు ఫస్టియర్ పరీక్షలు, మే 6 నుంచి 23వ తేదీ వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. 
 
మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. కాగా, ఇంటర్ పనిదినాల కుదింపు కారణంగా ప్రాక్టికల్స్ కు సంబంధించిన సిలబస్ లో 30 శాతం తగ్గించారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ విద్యామండలి వెల్లడించింది. అటు, తెలంగాణలో మే 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments