Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురంలో హింసకు ఛాన్స్ : నిఘా వర్గాల హెచ్చరిక!!

ఠాగూర్
సోమవారం, 20 మే 2024 (15:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ లెక్కింపు సమయంలో పిఠాపురంతో పాటు కాకినాడ సిటీ వంటి మరికొన్ని స్థానాల్లో హింస చెలరేగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించరు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ విభాగం ఒక నివేదికను తయారు చేసి అందచేసింది. ఓట్ల లెక్కింపు సమయంలో పిఠాపురం, కాకినాడ నగరంలో హింస చోటుచేసుకునే అవకాశం ఉందని ఆ నివేదికలో పేర్కొంది. కౌంటింగ్‌కు ముందు, హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. 
 
ఈ నివేదికను దృష్టిలో ఉంచుకుని కాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేట తదితర సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ ప్రత్యేక నిఘా పెట్టింది. 2019 ఎన్నికల్లోనూ ఇటీవలి పోలింగ్ సందర్భంగా గొడవలకు దిగిన, ప్రేరేపించిన వ్యక్తుల వివరాలను సేకరించి వారిపై పోలీసులు నిఘా ఉంచారు. అలాగే, ఈ ప్రాంతాల్లో కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎప్, ఏపీపీఎస్సీ, సివిల్ పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, వైకాపా తరపున వంగా గీత పోటీ చేయగా, కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేకర్ రెడ్డి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments