Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందిగామ‌లో వినూత్నంగా డ్రోన్‌తో శానిటేష‌న్!

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (10:20 IST)
కృష్ణా జిల్లా నందిగామ మున్సిపాలిటీలో తొలిసారి వినూత్నంగా డ్రోన్‌తో శానిటేష‌న్ చేస్తున్నారు.  మొట్ట మొదటిసారిగా హైదరబాద్ గరుడా స్పెష్ ఏజెన్సీస్ ద్వారా డ్రోన్‌తో శానిటేషన్ కార్యక్రమాన్ని నగర పంచాయతీ  చైర్ పర్సన్ మండవ వరలక్ష్మి, కమిషనర్ జయరామ్ ప్రారంభించారు. 
 
కరోనా థర్డ్  వేవ్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని, ముందస్తు జాగ్రత్తలో భాగంగా నందిగామ‌లో శానిటేష‌న్ ప్రారంభించారు. గాలిలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంద‌ని, టెక్నాలజీతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

డ్రోను ద్వారా నందిగామ పట్టణంలో ఉన్న 20 వార్డులలో సోడియం హైపో క్లోరైడ్ రసాయనాన్ని చల్లించి శానిటేషన్ చేస్తున్నట్టు కమిషనర్ జైరాం తెలిపారు. తక్కువ సమయంలో నగరమంతా శానిటేష‌న్ చేయ‌డానికి డ్రోన్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. డ్రోన్ వినియోగాన్ని న‌గ‌ర ప్ర‌జ‌లంతా వింత‌గా చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో  వైసిపి పట్టణ నాయకులు దేవేందర్ రెడ్డితోపాటు, ప‌లువురు అధికారులు ప‌ర్వ‌వేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments