Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో కలుషిత నీరు తాగి 30 మందికి అస్వస్థత... ఒకరు మృతి

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (11:26 IST)
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని దేవర ఉత్సవాల్లో కలుషిత నీరు తాగి 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరు మృతి చెందారు.

బుధవారం ఉదయం ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులందరినీ మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్జివి కృష్ణ, అసిస్టెంట్‌ కమిషనర్‌ మధుసూదన్‌ రెడ్డి పరామర్శించారు. పట్టణంలోని అరుణ్‌ జ్యోతి నగర్‌లో మంగళవారం దేవర ఉత్సవాలు జరిగాయి.

ఈ ఉత్సవాలకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అక్కడ తాగునీరు కలుషితం కావడంతో... ఆ నీరు తాగిన కాలనీవాసులలో 30 మందికి వాంతులు, విరోచనాలయ్యాయి. అస్వస్థతకు గురయిన వారందరినీ వెంటనే ఆదోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రోగులతో ఆసుపత్రి కిటకిటలాడింది. కాగా, వాంతులు విరోచనాలతో ఆస్పత్రిలో చేరిన అరుణ్‌ జ్యోతి నగర్‌కు చెందిన కోలుకోక రంగమ్మ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్జివి కృష్ణ, అసిస్టెంట్‌ కమిషనర్‌ మధుసూదన్‌ రెడ్డి ఏరియా ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు.

కుళాయిల ద్వారా రంగు నీళ్లు వచ్చాయని, ఆ నీళ్లను తాగిన వాళ్లందరికీ వికారం, వాంతులు, విరోచనాలు అయ్యాయని కాలనీవాసులు కమిషనర్‌ దృష్టికి తెచ్చారు.

నీటిని ల్యాబ్‌కు పంపి రిపోర్టు ఆధారంగా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ చెప్పారు. రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లకు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments