Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ - యూకేజీ

Webdunia
బుధవారం, 22 జులై 2020 (08:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ప్రైవేటు స్కూల్స్‌లోనే ఉన్న ఎల్కేజీ, యూకేజీలను ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా విద్యావ్యవస్థలో ప్రాథమిక పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అధికారులను కోరారు. 
 
ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో వచ్చే యేడాది నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఎల్కేజీ, యూకేజీ విద్యను ప్రవేశపెట్టనున్నారు. ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు అనువైన కొత్త సిలబస్ రూపొందించాలని ఆదేశించారు. 
 
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్య, జగనన్న గోరుముద్ద అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ కేజీ, యూకేజీ విద్యపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్.. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించడం పట్ల అనేక మంది విద్యారంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. 
 
ఈ నిర్ణయం వల్ల అనేక మంది పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందనీ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments