Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ - యూకేజీ

Webdunia
బుధవారం, 22 జులై 2020 (08:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ప్రైవేటు స్కూల్స్‌లోనే ఉన్న ఎల్కేజీ, యూకేజీలను ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా విద్యావ్యవస్థలో ప్రాథమిక పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అధికారులను కోరారు. 
 
ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో వచ్చే యేడాది నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఎల్కేజీ, యూకేజీ విద్యను ప్రవేశపెట్టనున్నారు. ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు అనువైన కొత్త సిలబస్ రూపొందించాలని ఆదేశించారు. 
 
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్య, జగనన్న గోరుముద్ద అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ కేజీ, యూకేజీ విద్యపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్.. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించడం పట్ల అనేక మంది విద్యారంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. 
 
ఈ నిర్ణయం వల్ల అనేక మంది పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందనీ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments