Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలహీనపడిన అల్పపీడనం... అయినా వర్షాలు కురుస్తాయనంటున్న ఐఎండీ

ఠాగూర్
గురువారం, 26 డిశెంబరు 2024 (15:28 IST)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా, దక్షిణ ఆంధ్రా, ఉత్తర తమిళనాడు రాష్ట్రాలకు మాత్రం ఈ వర్ష ముప్పు పొంచివుందని పేర్కొంది. 
 
మరోవైపు, అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో గురువారం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అందువల్ల జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ సూచన చేసింది. 
 
అదేసమయంలో రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడనం బలహీనపడినప్పటికీ, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా నెల్లూ రు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, పలు ప్రాంతాల్లో గణనీయ స్థాయిలో వర్షపాతం నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments