Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ కాళహస్తీశ్వరాలయంలో శివలింగ ప్రతిష్ట.. పెళ్లికాలేదని అలా చేశారట..!

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (15:23 IST)
వాయులింగం వెలసిన శ్రీ కాళహస్తీశ్వరాలయంలో.. అక్రమంగా శివలింగ ప్రతిష్ట జరిగింది. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. శ్రీకాళహస్తి ఆలయంలో ఈ నెల 11న అక్రమంగా శివలింగ ప్రతిష్టించిన వ్యవహారం సంచలనం రేపిన నేపథ్యంలో.. ప్రధాన అర్చకుడితో పాటు ఆలయ అధికారులపై ఈవో సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ నేపథ్యంలో అక్రమంగా శివలింగ ప్రతిష్ట ఎందుకు జరిగిందనే అంశం వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా దేవాలయంలో అనధికార విగ్రహాల ఏర్పాటు కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుత్తూరుకి చెందిన సులవర్ధన్, తిరుమలయ్య, ముని శేఖర్ అనే ముగ్గురు సోదరులను అరెస్ట్ చేసిట్లు పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు. వీరిని పోలీసులు లోతుగా విచారించగా.. జోతిష్యం, మూఢ నమ్మకాలు, వివాహం కాకపోవటంతో ఆలయంలో శివ లింగం, నంది విగ్రహాలను ప్రతిష్టించినట్లు వెల్లడించారు.
 
తిరుపతిలో ఈనెల 2న విగ్రహాలు చేయించి, ఈనెల 6న ఆలయంలో పెట్టినట్లు విచారణలో పోలీసులు తేల్చారు. సీసీ టీవీ విజువల్స్, ద్విచక్రవాహనాల నెంబర్లు ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుండి రెండు ద్విచక్రవాహనాలు, మూడు సెల్ ఫోన్‌లు సీజ్ చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments