Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు పిల్లల తండ్రి.. ఇద్దరు పిల్లల తల్లి ఆత్మహత్య.. ఎందుకంటే?

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (15:00 IST)
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. వారు కలిసి సహజీవనం చేస్తున్న ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయారు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌లోని గన్‌పౌండ్రీకి చెందిన బండారి దత్తు (40) అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. ఈయనకు భార్య హేమలత, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవల తన దూరపు బంధువు భారతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 
 
భారతి భర్త 15 ఏళ్ల క్రితమే చనిపోవడంతో ఆమె ఒంటరిగా జీవిస్తూ వస్తోంది. అయితే, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంగారెడ్డిలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ, అక్కడే ఉంటోంది. దత్తు, భారతిలు వివాహేతర సంబంధం పెట్టుకుని, సహజీవనం చేయడానికి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. 
 
అక్కడే సోమవారం ఇద్దరూ ఇనుప రాడ్డుకు ఉరివేసుకుని చనిపోయారు. నాలుగు రోజులుగా దత్తు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి హనుమాన్‌నగర్‌కి వెళ్లి విచారించారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించి, శవాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దయగల వ్యక్తి అమీర్ ఖాన్.. అందుకే ప్రేమించాను : గౌరీ స్ప్రత్

Super iconic: ఆన్ స్క్రీన్ శ్రీదేవిగా న‌టించాల‌నుంది.. తమన్నా భాటియా

Kantara 2: కాంతారా 2కి అన్నీ కలిసొస్తున్నాయ్.. వార్ 2తో పోటీ

పోటీపడుతున్న టాలీవుడ్ హీరోలు.. ఎందుకో తెలుసా?

'కోర్టు'తో కొత్త జీవితం మొదలైంది : నటుడు శివాజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments