Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిహోమ్‌ ఇంట్లోనే కోవిడ్ పరీక్ష : కిట్ అభివృద్ధి చేసిన హైదరాబాద్ ఐఐటీ

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (07:58 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను నిర్ధారించేందుకు వివిధ రకాలైన పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఇపుడు తాజాగా మరో కిట్ అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం ఇంట్లోనే ఉండి కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకోవచ్చు. ఈ కిట్‌ను హైదరాబాద్ ఐఐటీ అభివృద్ధి చేసింది. 
 
'కొవిహోమ్' అని దీనికి పేరు పెట్టింది. ఇది దేశంలోనే తొలి ర్యాపిడ్ ఎలక్ట్రానిక్ కొవిడ్ టెస్టింగ్ కిట్. వాణిజ్యపరంగా ఇది అందుబాటులోకి వస్తే దీని ధర సుమారు రూ.300 వరకు ఉండే అవకాశం ఉంది.
 
అనుమానితులు తమ గొంతు, ముక్కులోని స్రావాలను కిట్‌లోని ఎలక్ట్రానిక్ చిప్‌పై ఉంచితే 30 నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తోంది. అంతకంటే ముందు ఈ కిట్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించాల్సి ఉంటుంది. అందులోని ఐ-కొవిడ్ యాప్ ద్వారా అరగంటలోనే ఖచ్చితమైన ఫలితం వచ్చేస్తుంది.
 
దీని పనితీరును పరిశీలించిన సీఎస్ఐఆర్-సీసీఎంబీలు ఈ కిట్ 94.2 శాతం సామర్థ్యంతో, 98.2 శాతం నిర్దిష్టతతో పనిచేస్తున్నట్టు గుర్తించారు. కొవిహోమ్ కిట్‌తో ఇంట్లోనే పరీక్షలు చేసుకోవచ్చని ఐఐటీ డైరెక్టర్ ఆచార్య బీఎస్ మూర్తి తెలిపారు. ఈ కిట్‌కు పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments