Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేక వరద బాధితులకు కోటి రూపాయలు నేనే ఖర్చు పెట్టా: బొత్స

ఐవీఆర్
మంగళవారం, 11 మార్చి 2025 (17:35 IST)
విజయవాడ బుడమేరు వరద బాధితుల పరిహారంపై శాసన మండలిలో హోంమంత్రి అనిత వైసిపిని ఉద్దేశిస్తూ... వరద బాధితులకు రూ. కోటి సాయం అదిస్తామని ఆనాడు జగన్ ప్రకటించారనీ, ఐతే ఆ కోటి రూపాయలు ఇంతవరకూ వరద బాధితుల నిధికి రాలేదన్నారు. ఆ డబ్బు ఏమైందో తెలియదని చెప్పారు. ఈ ప్రశ్నపై బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు.
 
కూటమి ప్రభుత్వంపైన తమకు నమ్మకం లేదన్నారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సాయం ఏమేరకు అందిందో అక్కడి ప్రజలను అడిగితే తెలుస్తుందని అన్నారు. తాము ఇచ్చే సాయాన్ని కూడా మాయం చేస్తారని జగన్ ఇచ్చిన కోటి రూపాయల మొత్తానికి బాధ్యత నేనే తీసుకున్నానని చెప్పారు. ఆ కోటి రూపాయలతో బాధితులకు పాలు, నీళ్లు, నిత్యావసరాలు కొనుగోలు చేసి ఇచ్చినట్లు చెప్పారు.
 
బొత్స ఇచ్చిన సమాధానంపై కూటమి నాయకులు ఛలోక్తులు విసిరారు. ఐతే కోటి రూపాయలు మొత్తం అలా నీళ్ల రూపంలో స్వాహా చేసారా అంటూ సెటైర్లు వేసారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments