Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను క్షమించండి, మీరు రావద్దండి, నేనొక్కణ్ణే సీఎం వద్దకు వెళ్తానండి: ముద్రగడ రివర్స్

ఐవీఆర్
బుధవారం, 13 మార్చి 2024 (12:55 IST)
కాపు ఉద్యమ నాయకుడు ఏ క్షణాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని స్థితి నెలకొన్నది. రెండురోజుల క్రితం తను భారీ ర్యాలీతో కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి వైసిపిలో చేరుతానని బహిరంగంగా ఓ లేఖ రాసారు. దానితోపాటుగా... తనతో ర్యాలీలో పాల్గొనేవారు ఎవరి ఆహారం వాళ్లు తెచ్చుకోవాలని కూడా స్పష్టం చేసారు. ఇంతలోనే రివర్స్ అయ్యారు. రేపు 14 మార్చి నాడు తను ఒక్కడినే తాడేపల్లి వెళ్లి జగన్ సమక్షంలో వైసిపిలో చేరుతానని తెలిపారు.
 
కర్టెసి-ట్విట్టర్
ఈ సందర్భంగా ఆయన మరో బహిరంగ లేఖ రాసారు. అందులో... తను ఊహించిన దానికంటే స్పందన ఎక్కువగా వున్నదనీ, భారీగా కార్యకర్తలు, అభిమానులు వచ్చేట్లున్నారని, అందువల్ల వారంతా వస్తే సెక్యూరిటీ సమస్యలు ఉత్పన్నం కావచ్చని తెలిపారు. పైగా ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయాల్సి వుంటుందని, ఇదంతా చాలా టైం పట్టే విషయం కనుక భారీ ర్యాలీగా వెళ్లాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు. మార్చి 15 లేదా 16న తను ఒక్కడినే వెళ్లి ముఖ్యమంత్రిగారి సమక్షంలో పార్టీలో చేరుతానంటూ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments