Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపిలో చేరబోతున్నా, నాతో వచ్చేవారు ఎవరి ఆహారం వాళ్లు తెచ్చుకోండి: ముద్రగడ

ఐవీఆర్
సోమవారం, 11 మార్చి 2024 (13:57 IST)
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు. మార్చి 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరబోతున్నానంటూ బహిరంగ లేఖ రాసారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లి వరకూ తన వెంట ర్యాలీగా వచ్చే అభిమానులకు ఓ కీలక విషయాన్ని చెప్పారు.
 
ర్యాలీలో పాల్గొనేవారు ఎవరి ఆహారం వారే తెచ్చుకోవాలనీ, ఎందుకంటే ర్యాలీలో పాల్గొనేవారికి తను ఆహార సరఫరా ఏర్పాట్లు చేయడంలేదని తెలిపారు. వైసిపిలో ఎందుకు చేరుతున్నారనే దానికి సమాధానం ఇస్తూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని మరోసారి చూడాలనుకుంటున్నట్లు తెలిపారు.
 
తను ఏ పార్టీలో వున్నా పేదల సంక్షేమానికే కట్టుబడి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. కాగా కాపు ఉద్యమ నేతగా పేరున్న ముద్రగడ పద్మనాభం వైసిపిలో చేరడంపై రాజకీయంగా ఏపీలో చర్చ జరుగుతోంది. ముద్రగడ చేరికతో వైసిపికి లాభం జరుగుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెంగ్త్ వీడియో ప్లీజ్... “నెక్స్ట్ టైమ్ బ్రో” అంటూ నటి ఓవియా రిప్లై

రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన జూనియర్ ఎన్టీఆర్ "దేవర"

ఘనంగా నారా రోహిత్ - సిరి లేళ్ల నిశ్చితార్థం.. హాజరైన సీఎం బాబు దంపతులు

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో నాల్గవ చిత్రం ప్రకటన

చైతన్య రావు, హెబ్బా పటేల్ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ఆహాలో ఆదరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం-సంబంధిత దృష్టి నష్టాన్ని నివారించే లక్ష్యంతో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే?

పోషకాల గని సీతాఫలం తింటే ఈ వ్యాధులన్నీ దూరం

అక్టోబరు 11 ప్రపంచ బిర్యానీ దినోత్సవం - భారత్‌కు బిర్యానీ పరిచయం చేసింది ఎవరు?

తేనెలో ఊరబెట్టిన ఉసిరి కాయలు తింటే కలిగే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments