Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో కందుకూరి విరేశలింగం పంతులుగా జగన్ ఫీల్‌ కావొద్దు : ఆర్ఆర్ఆర్

ఠాగూర్
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (17:08 IST)
ఏపీ సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు క సలహా ఇచ్చారు. అధునాత కందుకూరి విరేశలింగం పంతులుగా ఫీలు కావొద్దని ఆయన సలహా ఇచ్చారు. ఆయన ఢిల్లీలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, తాను వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే శత్రువు అన్నారు. అంతేకానీ, నరసాపురం లోక్‌సభకు వైకాపా అభ్యర్థిగా ఉమాబాల లేకా మరో అభ్యర్థితో తనకు శత్రుత్వం లేదన్నారు. తనపై పోటీకి రోజుకో అభ్యర్థి పేరు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
 
సొంత చెల్లిని, తల్లిని తిట్టించం ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు. కుటుంబ సభ్యులను తిట్టించడాన్ని ముందు జగన్ ఆపాలన్నారు. అలాగే, కుటుంబంలోని మహిళలకు మర్యాద ఇవ్వడం జగన్ నేర్చుకోవాలని, ఆ తర్వాతే మహిళా సాధికారిత గురించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు. 
 
కాగా, ఏపీకి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టును 2023లోనే పూర్తి చేస్తామని సీఎం జగన్, ఆయన మంత్రివర్గ సహచరులు పదేపదే చెప్పారన్నారు. కానీ, ఇపుడు 2024 జనవరి నెల కూడా గడిచిపోయిందన్నారు. అవినీతి తావు లేకుండా పోలవరంను పూర్తి చేస్తామని జగన్ ఇపుడు కూడా చెబుతున్నారని, ఇలాంటి నటుడిని తాను ఇంతవరకు చూడలేదని చెప్పారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయలేని జగన్.. పోలవరం ప్రాజెక్టు ఎలా కడతారని ట్రిపుల్ ఆర్ ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments