Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సామాన్య భక్తుడిని, క్యూలైన్‌లో నిలబడి టోకెన్ పొందిన తిరుపతి ఎమ్మెల్యే

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (22:24 IST)
ఆయన ప్రజాప్రతినిధి. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ప్రముఖుడు. ఎక్కడికైనా వెళ్ళే ప్రోటోకాల్ ఉంటుంది. కానీ సాధారణ భక్తుడిలాగా కౌంటర్ లోకి వచ్చారు. టోకెన్‌ను పొందారు. తిరుమల శ్రీవారిని సామాన్య భక్తుడిలా ఈనెల 27వ తేదీ దర్శించుకోబోతున్నారు. ఆయనెవరో కాదు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.
 
వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లను టిటిడి విడుదల చేసిన నేపథ్యంలో టోకెన్ కేంద్రాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే స్వయంగా వచ్చారు. ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 50 టోకెన్ కేంద్రాలను పరిశీలించారు. క్యూలైన్లో భక్తులకు శానిటైజర్ ఇవ్వడం.. దాంతో పాటు సామాజిక దూరాన్ని పాటించడం చెప్పడం గమనించారు.
 
టిటిడి చేసిన ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు, క్యూలైన్ నుంచి తన ఆధార్ కార్డు చూపించి ఈనెల 27వ తేదీ దర్సనానికి సంబంధించిన టోకెన్‌ను కూడా పొందారు తిరుపతి ఎమ్మెల్యే. ఆ టోకెన్‌ను చూపించిన ఎమ్మెల్యే తను సాధారణ భక్తుడిలాగే తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వాదశి రోజు దర్సించుకుంటానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments