Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాబిడ్డను హత్య చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కిన భర్త

Webdunia
బుధవారం, 1 మే 2019 (15:01 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఓ కిరాతక భర్త కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను పాశవికంగా హత్య చేశాడు. ఆ తర్వాత ప్లాస్టింగ్ డ్రమ్ములో కుక్కాడు. ఆ తర్వాత ఆ కిరాతక భర్త నగరాన్ని విడిచిపోయాడు.
 
రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ దారుణ హత్యల వివరాలను పరిశీలిస్తే, జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కొత్తపల్లికి చెందిన గౌరవరపు రాజమ్మ, ఉప్పలయ్య దంపతులు తన కూతురు కవిత, కొడుకుతో కలిసి మన్సూరాబాద్‌లో నివాసముంటున్నారు. 
 
ఇంటి పక్కన ఒడిషాకు చెందిన ఆయూబ్, కవితను ప్రేమించి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. గత 18 నెలలుగా సయ్యద్‌ ఇబ్రహిం ఇంట్లో రెండేళ్లుగా కుమారుడు ఇర్ఫాన్‌తో కలిసి ఆయూబ్, కవిత దంపతులు అద్దెకుంటున్నారు. 
 
ఆయూబ్‌ ఆటోనగర్‌లోని ఇసుక లారీల అడ్డాలో కూలీగా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య శనివారం గొడవ జరిగింది. అనంతరం భార్య కవిత, కుమారుడు ఇర్ఫాన్‌ను హత్యచేసి వారిద్దరి శవాలను డ్రమ్ములో కుక్కి పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన తర్వాత ఆయూబ్ కనిపించకుండా పోయాడు. 
 
దీంతో ఈ కిరాతకుడే భార్యాబిడ్డలను హత్య చేసి ఒడిషాకు పారిపోయివుంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆయూబ్ కోసం రెండు ప్రత్యేక బృందాలను రాచకొండ కమిషనరేట్ ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఒడిషాకు వెళ్లి ఆయూబ్ కోసం గాలింపు చర్యలు చేపట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments