మత్తుమందు అక్రమ రవాణా.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (17:34 IST)
ఇటీవలి కాలంలో హైరాబాద్ నగరంలో మత్తుమందు పదార్థాలను అక్రమంగా తరలించే వారిలో ఆఫ్రికన్ మహిళలు పట్టుబడుతున్నారు. ఇటీవల గోవా నుంచి మాదకద్రవ్యాలను తరలిస్తూ హైదరాబాద్‌లో పట్టుబడ్డారు. ఇప్పుడు మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా హల్‌చల్ చేసింది. అక్రమంగా మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 
 
మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నేరెడ్‌మెట్‌ వద్ద వాహన తినిఖీలు నిర్వహిస్తుండగా మాదకద్రవ్యాల ముఠా పోలీసులకు చిక్కింది. వారి నుంచి భారీగా కొకైన్‌, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ కోటి రూపాయల వరకూ ఉండవచ్చని అంచనా వేసారు. 
 
ఏపీ, తెలంగాణలలో గత కొంతకాలంగా ఈ ముఠా వ్యాపారాన్ని కొనసాగిస్తోందని విచారణలో వెల్లడైంది. ఇతర ప్రాంతాల నుండి కొకైన్‌, హెరాయిన్‌ను తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని తేలింది. పట్టుబడిన నలుగురు నిందితులు ఆంధ్రప్రదేశ్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరికి మాదకద్రవ్యాలు ఎక్కడ నుండి వస్తున్నాయి. ఎవరికి సరఫరా చేస్తున్నారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్నా కు ప్రేమ పెండ్లి వర్కవుట్ కాదంటున్న వేణు స్వామి

Srileela: ఏజెంట్ మ్రిచిగా శ్రీలీల ఫస్ట్ లుక్ - కొత్త ట్విస్ట్

Vishnu Vishal: విష్ణు విశాల్... ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ రాబోతోంది

Sri Vishnu: మిత్ర మండలి ని మైండ్‌తో కాకుండా హార్ట్‌తో చూడండి : శ్రీ విష్ణు

తెలుసు కదా ఒక రాడికల్ సినిమా అవుతుంది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments