Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి ఒడిలోకి చేరిన పాప.. కోఠీ ఆస్పత్రిలో పాపను కిడ్నాప్ చేసిన మహిళ అరెస్ట్

కోఠీ ఆస్పత్రిలో తప్పిపోయిన చిన్నారి అమ్మ ఒడిలోకి చేరుకుంది. బీదర్‌లో పాపను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌ తీసుకొచ్చారు. కోఠి ఆస్పత్రిలో తల్లికి అప్పగించడంతో ఆమె ఆనందానికి అవధు

Webdunia
బుధవారం, 4 జులై 2018 (11:00 IST)
కోఠీ ఆస్పత్రిలో తప్పిపోయిన చిన్నారి అమ్మ ఒడిలోకి చేరుకుంది. బీదర్‌లో పాపను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌ తీసుకొచ్చారు. కోఠి ఆస్పత్రిలో తల్లికి అప్పగించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాప తల్లి ఒడికి చేరడంతో కుటుంసభ్యులు పోలీసులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో హైదరాబాద్‌‌లోని కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన పాప కథ సుఖాంతమైంది. 
 
ఆరేళ్ల తర్వాత పాప ఫుట్టిందని సంతోషంలో ఉన్న కుటుంబానికి కిడ్నాప్ రూపంలో విషాదం తప్పలేదు. కానీ కిడ్నాప్‌కు గురైన పాపను ఓ మహిళ హైదరాబాద్‌లో ఎంజీబీఎస్‌లో బీదర్‌ బస్సు ఎక్కినట్లు గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. కర్ణాటక పోలీసులకు సమాచారం ఇచ్చి బీదర్‌ పోలీసులను అలర్ట్ చేశారు. ఏసీపీ చేతన నేతృత్వంలో పది బృందాలుగా విడిపోయిన పోలీసులు బీదర్‌కు వెళ్లి రెండో తేదీ రాత్రంతా స్థానిక పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారిని ఎత్తుకెళ్లిన మాయలేడి ఫొటోలను పలు పోలీస్‌స్టేషన్లకు పంపి అప్రమత్తం చేశారు. 
 
కోఠి ప్రభుత్వాసుపత్రిలో పాపను కిడ్నాప్‌ చేసిన కిడ్నాపర్‌ బీదర్‌ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర శిశువుని వదిలిపెట్టి వెళ్లిపోయింది. శిశువును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శిశువును స్వాధీనం చేసుకున్న బీదర్ పోలీసులు ప్రాథమికంగా వైద్య సేవలు అందించారు. తల్లిఒడిలో ఉండాల్సిన పసికందుకు సకాలంలో తల్లిపాలు అందకపోవడంతో నీరసించిపోయింది. 
 
ఆపై పాప ఆరోగ్యం నిలకడగా మారిన తర్వాత హైదారాబాద్‌కు తీసుకొచ్చి తల్లి ఒడిలోకి చేర్చారు. మరోవైపు కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. శిశువును ఎత్తుకెళ్లిన మహిళను బీదర్‌‌లో కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments