Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరగతి గది బెంచి కింద కొండచిలువ...

అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన విషపు సర్పాలు, కొండచిలువలు ఇపుడు ఏకంగా జనావాస ప్రాంతాల్లోకి వస్తున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. తాజాగా మెదక్ జిల్లాలోని ఓ పాఠశాల తరగతి గదిలోని బెంచి కింద పెద్ద కొండచిలువ దర్

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (08:54 IST)
అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన విషపు సర్పాలు, కొండచిలువలు ఇపుడు ఏకంగా జనావాస ప్రాంతాల్లోకి వస్తున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. తాజాగా మెదక్ జిల్లాలోని ఓ పాఠశాల తరగతి గదిలోని బెంచి కింద పెద్ద కొండచిలువ దర్శనమిచ్చింది. దీన్ని చూసిన విద్యార్థులు ప్రాణభయంతో తల్లడిల్లిపోయారు. 
 
మెదక్ జిల్లా మద్దుల్వాయి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులోని ఓ తరగతి గదిలోని ఓ బెంచిని జరిపేందుకు విద్యార్థులు ప్రయత్నించగా అది జరగలేదు. దీంతో విద్యార్థులు బెంచి కింద తొంగిచూడగా, అక్కడ పెద్ద కొండచిలువ కనిపించింది. దీంతో పెద్దగా కేకలు వేస్తూ తరగతి గది నుంచి పరుగులు తీశారు. 
 
ఆ తర్వాత ఉపాధ్యాయులు రంగప్రవేశం చేసి తరగతి గదిలోకి పొగ పెట్టి దాన్ని చంపేశారు. మద్దుల్వాయి ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి తరచూ పాములు రావడం సర్వసాధారణమని కానీ ఈ సారి ఏకంగా కొండచిలువ తరగతి గదిలోకి వచ్చిందని ఉపాధ్యాయులు చెప్పారు. తమ పాఠశాలలోకి పాములు, కొండచిలువలు రాకుండా ప్రహరీగోడ నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments