Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్క... ప్రాణం తీసింది.. ఎలా?

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఓ విషాదం జరిగింది. చికెన్ ముక్క ఒకటి ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. అదెలాగంటారా? అయితే, ఈ కథనం చదవండి. హైదరాబాద్, చిక్కడపల్లిలోని అశోక్‌నగర్‌లో నిర్మల, కుమారస

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (10:51 IST)
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఓ విషాదం జరిగింది. చికెన్ ముక్క ఒకటి ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. అదెలాగంటారా? అయితే, ఈ కథనం చదవండి. హైదరాబాద్, చిక్కడపల్లిలోని అశోక్‌నగర్‌లో నిర్మల, కుమారస్వామి (48) అనే దంపతులు నివశిస్తున్నారు. స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో కుమార స్వామి వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఈనెల 16న రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చాడు. 
 
చికెన్ కూరతో చపాతీ తింటుండగా ఒక్కసారిగా చికెన్ ముక్క అతని గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో వెంటనే నీళ్లు తాగిన ఆయన కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత చికెన్ ముక్కను వెలికి తీసేందుకు నిర్మల నానా విధాలుగా ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు ఫలించక పోవడంతో 108 ఆంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. 
 
కుమార స్వామిని పరిశీలించిన వైద్యులు... అత్యవసరంగా ఆపరేషన్ చేసి గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్కను తొలగించారు. గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్కను వైద్యులు బయటకు తీశారు. అయితే పరిస్థితి విషమించడంతో కుమారస్వామి మంగళవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments