Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డుపై బైక్ ఆపేసి పరిగెత్తిన భర్త.. అవాక్కైన భార్య.. ఎందుకు?

Webdunia
ఆదివారం, 10 జనవరి 2021 (18:45 IST)
పోలీసులను చూసి బైక్ ఆపేసి భర్త పారిపోయాడు. భార్యకు సిటీలో ఇంటి అడ్రస్ సరిగ్గా తెలియకపోవడంతో అక్కడే ఏడుస్తూ కూర్చుంది. పోలీసులు వివరాలు సేకరించి క్షేమంగా అప్పగించారు.
 
భార్యను బైక్‌పై ఎక్కించుకుని వస్తున్న భర్త ఉన్నట్టుండి బండి ఆపేశాడు. అక్కడి నుంచి పరుగు లంఘించుకున్నాడు. ఎందుకు పారిపోతున్నాడో తెలియని భార్య షాక్‌కి గురైంది. నడిరోడ్డుపై నిల్చుండిపోయింది. భర్త రాకపోవడంతో ఏడుస్తూ కూర్చున్న భార్యని గమనించిన పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె భర్తని పిలిపించి భద్రంగా అప్పజెప్పారు. ఈ షాకింగ్ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.
 
శంషాబాద్ సమీపంలో బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్ చేస్తుండటంతో అటువైపుగా బైక్‌పై వస్తున్న రాజు సడెన్‌గా బండి ఆపేశాడు. భార్య సీతను నడిరోడ్డుపై వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. భర్త ఎందుకు పారిపోతున్నాడో తెలియని ఆమె షాక్‌కి గురైంది. 
 
అయితే ఆమెకు ఇంటి అడ్రస్ కూడా సరిగ్గా తెలియకపోవడంతో దిక్కుతోచని స్థితిలో అక్కడే నిలుచుండిపోయింది. కొద్దిసేపటికి పక్కనే ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లోకి వెళ్లి కూర్చుంది. అక్కడ ఏడుస్తూ కూర్చున్న సీతని ఎయిర్‌పోర్ట్ మొబైల్ పోలీసులు గమనించారు. ఆమెను స్టేషన్‌కి తీసుకెళ్లి ధైర్యం చెప్పి వివరాలు సేకరించారు. భర్త రాజును పిలిపించి భార్యను భద్రంగా అప్పజెప్పారు. డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోతానన్న భయంతోనే రాజు పారిపోయాడట! 

సంబంధిత వార్తలు

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

విష్ణు మంచు కన్నప్పలో కాజల్ అగర్వాల్

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments