Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటి రూపాయలు టోకరా.. కి''లేడీ'' అరెస్ట్.. భర్త కూడా సహకరించాడట..

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (09:11 IST)
మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్న తరుణంలో.. మహిళలు కూడా మగాళ్లు నమ్మించి మోసం చేసే ఘటనలు జరుగుతూనే వున్నాయి. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాదులో చోటుచేసుకుంది. ఆర్థికంగా సాయం చేస్తే పెళ్లి చేసుకుంటానని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను నమ్మించి రూ.కోటితో ఉడాయించిందో కి"లేడీ". 
 
కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ ఈ ఘటనపై మాట్లాడుతూ.. వసంతనగర్‌కు చెందిన చైతన్య విహారి ఉప్పలపాటి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అతనికి తెలుగు మాట్రిమొనీలో అనుపల్లవి మాగంటి పేరిట ఓ మహిళ పరిచయమైంది. 
 
తాను వైద్యురాలిగా జూబ్లీహిల్స్‌లో ఉంటున్నట్లు నమ్మించింది. తనకు దక్కాల్సిన ఆస్తులు కుటుంబ సభ్యులు ఇవ్వనంటున్నారని, లీగల్‌ సమస్యల పరిష్కారానికి రూ.కోటి ఖర్చవుతుందని నమ్మబలికింది. దీంతో బాధితుడు రూ.1.02 కోట్లు ఆమెకు బదిలీ చేశాడు. కానీ తర్వాతే ముఖం చాటేసింది. 
 
ఇదే తరహాలో ఎన్‌ఆర్‌ఐలకు వల విసురుతున్న ఈమెను జూబ్లీహిల్స్‌ పోలీసులు గత నెల 27న అరెస్ట్‌ చేశారు. భర్తతోపాటు ఇతర కుటుంబ సభ్యులూ ఆమెకు సహకరిస్తున్నట్లు తేలింది. విలాస జీవితానికి అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ కేసు.. చేధించిన పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments