Webdunia - Bharat's app for daily news and videos

Install App

64 రోజుల పాటు దీక్షకు కూర్చున్న బాలిక.. సెల్ఫీలు తీసుకున్నారు.. పట్టించుకోలేదు.. కానీ?

టెక్నాలజీ ఎంతగా పెరిగినా.. మూఢనమ్మకాలు మాత్రం మరుగున పడనే లేదు. మత గురువులు ఆదేశించారని.. బాలికను 64 రోజుల ఉపవాస దీక్షకు కూర్చోబెట్టి.. ఆమె ప్రాణాలు బలిగొన్నారు. ఏకంగా 64 రోజులు ఆకలిని దింగమింగుకుని,

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2016 (13:04 IST)
టెక్నాలజీ ఎంతగా పెరిగినా.. మూఢనమ్మకాలు మాత్రం మరుగున పడనే లేదు. మత గురువులు ఆదేశించారని.. బాలికను 64 రోజుల ఉపవాస దీక్షకు కూర్చోబెట్టి.. ఆమె ప్రాణాలు బలిగొన్నారు. ఏకంగా 64 రోజులు ఆకలిని దింగమింగుకుని, మతపెద్దలు చెప్పారని, తల్లిదండ్రులు చెప్పారని ఆ బాలిక దీక్షకు కూర్చుంది. అయితే 64 రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయింది. 
 
ఆకలి బాధను దిగమింగుకుని... అస్వస్థతతో చివరికి మృత్యుఒడికి చేరుకుంది. వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్‌ పాట్‌ బజార్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న బంగారు నగల వ్యాపారి లక్ష్మీ చంద్‌ మానిష్‌, సమారియా దంపతులు. వీరి కూతురు ఆరాధన. ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. వారి మతాచారం ప్రకార ఆరాధనను 64 రోజుల ఉపవాస దీక్షకు కూర్చో బెట్టారు. ఆమె దీక్ష అక్టోబర్‌ 1న ముగిసింది. 
 
దీక్ష సమయంలో సాయంత్రం 6 గంటల లోపు కేవలం మంచినీళ్లు మాత్రమే తాగాల్సి ఉంటుంది. దీంతో ఆ చిన్నారి ఆరోగ్యం క్షీణించింది. దీక్ష మధ్యలో అనేక సార్లు స్పృహ కోల్పోయింది. సెల్ఫీలు తీసుకున్నారు. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీక్ష ముగిసిన మూడో రోజున ఈ నెల 3న బాలిక స్పృహ తప్పి పడిపోయింది. ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందతూ అదే రోజు మరణించింది. బాలిక మృతిపై బాలల హక్కుల సంఘం నాయకులు నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments