Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోర్డుపై పాఠాలు చెపుతున్న మహిళా టీచర్‌ను విద్యార్థుల ముందే కత్తితో పొడిచేసిన భర్త

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (12:31 IST)
పశ్చిమ గోదావరి జిల్లాలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయురాలిని ఆమె భర్త కత్తితో పొడిచిన సంఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు పాఠాలు చెపుతున్న సమయంలో క్లాసు గదిలోకి దూసుకు వచ్చిన అతడు కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. ప.గో జంగారెడ్డి మండలానికి చెందిన దుర్గాప్రసాద్ 2016లో నాగలక్ష్మి అనే మహిళను పెళ్లాడాడు. వీరికి మూడేళ్ల కుమార్తె కూడా వుంది. ఐతే భార్యాభర్తల మధ్య ఓ విషయంపై మనస్పర్థలు రావడంతో ఆమె భర్తకు దూరంగా వుంటోంది. మండల ప్రజాపరిషత్ పాఠశాలలో పనిచేసే ఈమె తన భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.
 
అక్కడే వుంటే ఏదయినా అఘాయిత్యం చేస్తాడన్న భయంతో కాకిలేరు పాఠశాలకు బదలీ చేయించుకుంది. ఐతే దుర్గాప్రసాద్ అక్కడికే వచ్చి క్లాస్ రూంలో పాఠాలు చెపుతున్న ఆమెపై కత్తితో దాడి చేసాడు. విద్యార్థులు కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాగా నాగలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా వున్నట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments