Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టుకున్నోడే హంతకుడు... వీడిన తిరుపతి టెక్కీ హత్య కేసు మిస్టరీ

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (13:21 IST)
తిరుప‌తిలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరైన యువ‌తి మృత‌దేహం ద‌హ‌నం కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ‌కుడే ఆమెను హ‌త్య చేశాడ‌ని తేల్చారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుప‌తి రుయా ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో ఇటీవ‌ల‌ కాలిన స్థితిలో ఓ మృత‌దేహాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీనిపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన స్థానిక పోలీసులు.. అది పుంగ‌నూరు మండ‌లం రామ‌సముద్రానికి చెందిన భువ‌నేశ్వ‌రి మృత‌దేహంగా గుర్తించారు. 
 
దీంతో పోలీసుల విచార‌ణ‌లో పలు అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. భువ‌నేశ్వ‌రిని ఆమె భ‌ర్త శ్రీ‌కాంత్ రెడ్డి హ‌త్య చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. భార్య‌ను ఇంట్లో హ‌త్య చేసి రుయా ఆసుప‌త్రి ఆవరణలో మృతదేహాన్ని శ్రీ‌కాంత్ రెడ్డి త‌గ‌ల‌బెట్టినట్లు తేలింది. 
 
రెండున్న‌రేళ్ల క్రితం వారిద్ద‌రు ప్రేమ‌ వివాహం చేసుకున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ఈ రోజు సాయంత్రం మీడియాకు పూర్తి వివ‌రాలు వెల్ల‌డించే అవ‌కాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments