Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం: గొడ్డలితో హత్య చేసిన భర్త.. అనంతలో దారుణం

Webdunia
ఆదివారం, 5 జులై 2015 (16:34 IST)
అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకున్న ఆ భర్త ఆమెను పాశవికంగా హత్యచేశాడు. ఈ ఘటన జిల్లాలోని కనగానపల్లి మండలం, కుర్లపల్లిలో చోటుచేసుకుంది. 
 
కుర్లపల్లి గ్రామానికి చెందిన ఆకులప్ప అనే వ్యక్తి శనివారం అర్ధరాత్రి దాటాక భార్యపై గొడ్డలితో దాడిచేశాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. అనంతపురం, గుత్తి మండలంలోని రజాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గుంతకల్లు నుంచి గుత్తి వస్తున్నఆటో రజాపురం వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments