Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాదంలో భర్త మరణం, కర్ఫ్యూతో భార్య రోడ్డు ప్రమాదంలో మృతి

Webdunia
గురువారం, 6 మే 2021 (17:47 IST)
ప్రమాదం రూపంలో భర్తను తీసుకువెళ్లింది. ఆ కుటుంబాన్ని కుంగదీసింది. భర్త స్మృతుల్లో కాలం వెల్లదీస్తున్న ఆమెకు కారుణ్య నియామకాల్లో భాగంగా ఉద్యోగం లభిస్తే.. ఆ వ్యాపకాల్లో అయినా గాయం మానుతుందని భావించారు ఆ కుటుంబ సభ్యులు.
 
రోజూ బస్సులో విధులకు వెళ్లే ఆమె.. కర్ఫ్యూ నేపథ్యంలో బస్సులు ఉండవనుకుంటూ.. ద్విచక్ర వాహనంపై విధులకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. దగదర్తి మండలం లయన్స్‌ నగర్‌ వద్ద బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం... నెల్లూరులో తన చెల్లితో నివాసం ఉంటున్న సంధ్య(29) కావలి ఆర్డీవో కార్యాలయంలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రోజూ అక్కడి నుంచి కావలికి బస్సులో వచ్చి విధులు ముగించుకుని తిరిగి వెళ్లేవారు.
 
బుధవారం నుంచి కర్ఫ్యూ నేపథ్యంలో మధ్యాహ్నం వరకే బస్సులు తిరుగుతాయని అధికారులు ప్రకటించడంతో సాయంత్రం వచ్చేటప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో అని భావించిన సంధ్య.. తన స్కూటీపై కావలికి బయలుదేరారు. ఆ క్రమంలో దగదర్తి లయన్స్‌నగర్‌ సమీపంలోకి వెళ్లే సరికి వెనుక నుంచి టిప్పర్‌ ఢీకొంది.
 
ప్రమాదంలో ఆమె తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై వేణుగోపాల్‌ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments