Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు భార్యలు.. మొదటి భార్యపై మోజు తీరింది... బ్లేడ్‌తో దాడిచేసి భర్త పరారీ

హైదరాబాద్‌లో ముగ్గురు భార్యల ముద్దుల భర్త కటకటాలపాలయ్యాడు. ముగ్గురు భార్యల్లో మొదటి భార్యపై మోజు తీరడంతో ఆమెను అంతమొదించాలని ప్లాన్ చేసిన భర్త చివరకు ఆమెపై దాడి చేసి పరారైన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి

Webdunia
ఆదివారం, 7 మే 2017 (09:52 IST)
హైదరాబాద్‌లో ముగ్గురు భార్యల ముద్దుల భర్త కటకటాలపాలయ్యాడు. ముగ్గురు భార్యల్లో మొదటి భార్యపై మోజు తీరడంతో ఆమెను అంతమొదించాలని ప్లాన్ చేసిన భర్త చివరకు ఆమెపై దాడి చేసి పరారైన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, హఫీజ్‌బాబానగర్‌ ఎ-బ్లాక్‌లో పర్విన్‌బేగం (23) నివసిస్తోంది. ఆమె భర్త లతీఫ్‌ అలియాస్‌ అజీమ్‌(30) శుక్రవారం రాత్రి 10 గంటలకు ఇంటికొచ్చి భార్యతో ఘర్షణ పడ్డాడు. నాలుగు రోజులకొకసారి ఇంటికెళుతున్న అతడు ఆమెను చంపాలనుకున్నాడు. బ్లేడ్‌తో ఫర్వీన్‌బేగం గొంతు కోశాడు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై దాడిచేసి పారిపోయాడు. గాయపడిన ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 
 
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ విచారణలో లతీఫ్‌కు ముగ్గురు భార్యలు ఉన్నట్టు తేలింది. రెండోభార్య దుబాయ్‌లో, మూడోభార్య సభా రియాసతనగర్‌లో నివసిస్తున్నారు. అందులో పర్విన్ బేగం మొదటి భార్య. ఈమెపై మోజు తీరడంతో ఆమెను హత్య చేయాలని భావించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఫర్వీన్‌బేగానికి ఇద్దరు కుమారులు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments