Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సులో భారీగా డబ్బు

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (08:56 IST)
కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా డబ్బు పట్టుబడింది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో చేపట్టిన తనిఖీల్లో ఓ ఆర్టీసీ బస్సులో వారి బ్యాగ్స్ ఓపెన్ చేస్తే డబ్బులు కట్టాల కట్లు నోరెళ్ళబెట్టి ఉన్న ప్రయాణికులు. రూ.1.90 కోట్ల నగదు పట్టుబడింది.

అనంతపురంలోని మారుతినగర్‌కు చెందిన కోనేరు రామ చౌదరి, గుంతకల్‌కు చెందిన రంగనాయకులు హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు కుప్పం డిపో బస్సులో వస్తున్నారు. నిఘావర్గాల సమాచారంతో సీఐ లక్ష్మీదుర్గయ్య, సిబ్బంది బస్సును ఆపి తనిఖీ చేశారు.

దీంతో వీరిద్దరి బ్యాగుల్లో రూ 1.90 కోట్ల నగదు బయటపడింది. అప్పటి వరకు తమ పక్కనే ప్రయాణించిన వ్యక్తుల వద్ద కట్టల కొద్దీ డబ్బు చూసి తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అయితే ఈ నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో నగదును సీజ్‌ చేసి, స్థానిక కర్నూలు అర్బన్‌ పోలీస్‌ స్టేషన్లో అప్పగించారు.

రామచౌదరిని విచారించగా పొలం కొనుగోలు కోసం హైదరాబాద్‌ వెళ్లామని, బేరం కుదరకపోవడంతో డబ్బుతో స్వగ్రామానికి వెళుతున్నట్టు పోలీసులకు తెలిపారు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments