Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఆలయ అలంకరణ చేస్తుంటే చెరిపేస్తారా?: తితిదే అధికారులపై దాత సునీత ఆగ్రహం

ఐవీఆర్
శనివారం, 18 జనవరి 2025 (15:50 IST)
వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా తిరుమల ఆలయ అలంకరణ కోసం తాము ఎన్నో అనుమతులు తీసుకుని లక్షల రూపాయలు వెచ్చించి శ్రీవారికి చేసిన పుష్పాలంకరణను చెరిపివేస్తారా అంటూ దాత సునీత ఆగ్రహం వ్యక్తం చేసారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తీరు ఎంతమాత్రం సహేతుకం కాదంటూ ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. 3 నెలలకి ముందుగానే తాము అన్ని అనుమతులు తీసుకున్నామని అధికారులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.
 
ఇక్కడికి డబ్బు సంపాదించాలని రాలేదనీ, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చామని అన్నారు. ఐదుగురు డిజైనర్లతో ఆలయ అలంకరణ కోసం శ్రమించామనీ, రూ. 25 లక్షలు పెట్టి సంప్రదాయ పుష్పాలను, రూ. 15 లక్షలు వెచ్చించి ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేక అరుదైన పుష్పాలను తెప్పించి అలంకరణ చేసామన్నారు. కొండపైకి క్రేన్స్ రాకూడదని కేవలం ఓ కారణం చెప్పి అంత కష్టపడి చేసిన పనిని చెరిపివేస్తారా... ఇది చిన్న విషయమా... ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments