Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ క్యాపిటల్: విజయవాడ-గుంటూరు-ప్రకాశం మధ్యలోనే?

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (15:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై ఏపీ సర్కారు భారీ కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ-గుంటూరులతో... ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతం తీవ్రంగా పోటీపడుతోంది. దొనకొండను రాజధానిని చేయాలనే వాదన రోజురోజుకూ బలపడుతోంది. ఇటీవలే మాజీ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, మాజీ ఛీప్ సెక్రటరీ కె.జయభారతరెడ్డిలు దొనకొండను రాజధాని చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలను వివరిస్తూ... ఒక నివేదికను తయారుచేశారు. నివేదికను తయారుచేయడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి ఆ నివేదికను అందజేశారు. 
 
విజయవాడ-గుంటూరుల మధ్య రాజధాని ఏర్పాటు చేయాలంటే భూమి సమస్య ఉత్పన్నం అవుతోందని... కానీ దొనకొండ ప్రాంతంలో భూమి సమస్య ఉండదని కమిటీ చంద్రబాబుకు తెలియజేసింది. దొనకొండ ప్రాంతం చుట్టూ లక్షన్నర ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని వారు చంద్రబాబుకు చెప్పారు. దొనకొండ ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకుంటే సువిశాలమైన రాజధానిని, పక్కా ప్రణాళికతో నిర్మించుకోవచ్చునని కమిటీ అధికారులు తెలిపారు.అంతేకాకుండా దొనకొండ అటు రాయలసీమకు, ఇటు కోస్తాకు సరిగ్గా మధ్యలో ఉంటుందని వారు చంద్రబాబు దగ్గర వ్యాఖ్యానించారు.
 
అయితే, దొనకొండ అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉందన్న వాదనపై ప్రభుత్వ వర్గాలు అనుమానపడుతున్నాయి. అలాగే, దొనకొండ ప్రాంతంలో నీటి సమస్యపై కూడా ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయి

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments