Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్ యాజమాన్యాలు ప్రభుత్వానికి సహాయపడాలి: గుంటూరు జిల్లా కలెక్టర్

Webdunia
గురువారం, 7 మే 2020 (19:17 IST)
కరోనా వైరస్ నేపధ్యంలో విదేశాలలో చిక్కుకున్న తెలుగు వారిని వారి స్వస్థలాలకు చేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, విదేశాల నుండి వచ్చే వారిని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్ చేసి పర్యవేక్షణ చేస్తామని జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.

గురువారం కలక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో విదేశాల నుండి వచ్చే వారిని హోటల్ క్వారంటైన్ లో ఉంచేందుకు చేపట్టవలసిన ఏర్పాట్లపై గుంటూరులోని హోటల్ యజమానులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హోటల్ యజమానులతో మాట్లాడుతూ, జిల్లాలో ఎన్ని హోటళ్ళు వున్నాయి, వాటిలో ఎన్ని సింగల్, డబల్ రూములు గలవి వున్నాయి, వాటి టారిఫ్ రెట్లు తెలియజేయాలన్నారు.  హోటళ్ళలో రెస్టారెంట్ వుంటే అల్పాహారం, భోజనం, డిన్నర్ కు మెనూ తయారు చేసి వాటి రెట్లు కూడా తెలియజేయాలన్నారు. 
 
రెస్టారెంట్ లేని వారు రూము టారిఫ్ ను కోడ్ చేయాలని తెలిపారు.  ఈ కరోనా సమయంలో హోటల్ యాజమాన్యాలు ప్రభుత్వానికి సహాయపడాలని కోరారు. ఈ సమావేశంలో  జిల్లా హోటల్ యాజమాన్యాల అసోసియేషన్ ప్రెసిడెంట్ వి రాయల్ పార్క్ హోటల్ యజమాని కిశోర్, వివిధ హోటల్ యాజమాన్యాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments