Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు కోసం కన్నకూతుర్నే చంపేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 24 మే 2016 (11:27 IST)
పరువు హత్యలు మన రాష్ట్రంలోనూ పెరిగిపోతున్నాయి. ప్రేమించిన పాపానికి తల్లిదండ్రులే కన్నకూతుర్ని గొంతు నులిమి హత్య చేశారు. ఈ ఘటన కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలుకా తమటంపల్లిలో చోటుచేసుకుంది. తక్కువ కులానికి చెందిన యువకుడిని ప్రేమించిని పాపానికి సమాజంలో తమ పరువును కాపాడుకునేందుకు కన్నవాళ్లే కాలయముళ్లుగా మారిపోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. తమటంపల్లికి చెందిన ప్రియారెడ్డి (17) అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నకూతురిని వద్దని వారించారు. అయితే దొంగచాటుగా ప్రియుడిని కలిసేందుకు వెళ్ళిన ప్రియారెడ్డి.. అతనితోనే పారిపోతుందనే భయంతో తండ్రి బైరవరెడ్డి, తల్లి, సోదరుడు కలిసి ఆ యువతిని గొంతునులిమి చంపేశారని పోలీసులు తెలిపారు. ఇక నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కమల్ హాసన్ వాడిన దుస్తులు కావాలని అడిగి తెప్పించుకున్నా : ప్రభాస్

బుజ్జి తోపాటుఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కు 25 మందికిపైగా పనిచేసిన ఇంజనీర్లు

కల్కి 2898 AD గ్రాండ్ గాలా.. బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

తర్వాతి కథనం
Show comments