Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్షన్ 8 ముగిసిన అధ్యాయం : కేంద్ర హోంశాఖ స్పష్టీకరణ

Webdunia
బుధవారం, 1 జులై 2015 (09:28 IST)
హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం విభజన చట్టంలో రూపొందించిన సెక్షన్ 8 అంశం ఇపుడు ముగిసిన అధ్యాయమని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది. 
 
గత ఏడాది జూన్‌ 4వ తేదీన సెక్షన్‌ 8 అమలుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో గవర్నర్‌కు అధికారాలు కట్టబెడుతూ తెలంగాణ బిజినెస్‌ రూల్స్‌లో మార్పులు చేయాలని ఈ లేఖలో సూచించింది. అయితే... ఈ లేఖను ఉపసంహరించుకోవాలని గత ఏడాది జూన్‌ 27వ తేదీన రాజ్యసభలో పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కోరారు. 
 
దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఈ నెల 16వ తేదీన సమాధానమిస్తూ పాల్వాయికి లేఖ రాశారు. ‘కేంద్రం రాసిన లేఖకు తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. రాజ్యాంగం, పునర్విభజన చట్టం ప్రకారం శాంతి భద్రతల బాధ్యతను నిర్వర్తిస్తామని హామీఇచ్చింది. దీంతో ఈ అంశం ముగిసింది. కాబట్టి, లేఖను ఉపసంహరించుకోవాల్సిన అవసరం లేదు’ అని మంత్రి స్పష్టంచేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments