Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరైనా చెల్లి, తల్లి జోలికి వస్తే లాగి కొడ్తారు.. జగన్‌కి పౌరుషం రాలేదా? (video)

సెల్వి
గురువారం, 7 నవంబరు 2024 (21:01 IST)
Anitha
సోషల్ మీడియా సమస్యల కోసం ప్రత్యేక చట్టం చేయాలనే అంశంపై వేగంగా స్పందించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లకు ధన్యవాదాలు అని హోం మంత్రి అనిత అన్నారు. కొందరు తనను లక్ష్యంగా చేసుకొని పోస్టులు పెడుతున్నారని అనిత గుర్తుచేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
 
సోషల్ మీడియా పోస్టులపై అనిత స్పందిస్తూ.. "ఆ పోస్టులు చూసి బాధేసింది. కానీ నేను గట్టిదాన్ని. అందుకే చలించలేదు. పోస్టులు చేస్తోన్న వెదవలను ఊరికే వదిలే ప్రసక్తే లేదు. కొందరు సోషల్ మీడియాను అస్త్రంగా వాడుతున్నారు. ఉగ్రవాదుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిని ఊరికే వదిలే ప్రసక్తే లేదు. చట్టం ముందు నిలబెడతాం" అని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ నోటి వెంట వినకూడని మాటలు వస్తున్నాయని మండిపడ్డారు.
 
"చీకటి రోజులు అంటే ఏంటో తెలుసా జగన్ రెడ్డి? మా అక్కని ఏడిపిస్తున్నారు అంటే, ఒక చిన్న కుర్రాడిని తగలబెట్టేసారు చూడు. అవి చీకటి రోజులు అంటే. కనీసం ఒక ఎంక్వయిరీ చేసావా జగన్" అంటూ అనిత ఫైర్ అయ్యారు. 
 
"ఎవరైనా తన చెల్లి, తల్లి జోలికి వస్తే లాగిపెట్టి కోడతారు. అలాంటిది షర్మిలమ్మ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని నీ సోషల్ మీడియా వాళ్ళు పోస్ట్‌లు పెట్టినా కూడా జగన్‌కి పౌరుషం రాలేదా?" అంటూ అనిత వెల్లడించారు. కొన్ని కుక్కలు ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడితే చేతులు కట్టుకుని కూర్చోవాలా..? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments