Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజవాడకు పాకిన హిజాబ్ వివాదం - లయోలా కాలేజీలో...

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (15:06 IST)
కర్నాటక రాష్ట్రంలో మొదలైన హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో కాస్తంత సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చేరుకుంది. స్థానిక లయోలా కాలేజీలో హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను కాలేజీ యాజమాన్యంలోనికి అనుమతించలేదు. 
 
దీనికి ఆ విద్యార్థులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. తామంతా మొదటి సంవత్సరం నుంచి హిజాబ్ ధరించే తరగతులకు హాజరవుతున్నామని, ఇపుడు కొత్తగా తమను అడ్డుకోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 
 
ఈ వ్యవహారం బయటకుపొక్కడంతో టీవీల్లో వార్తలు వచ్చాయి. దీంతో ఈ కాలేజీ వద్దకు భారీ సంఖ్యలో ముస్లిం ప్రజలు చేరుకుంటున్నారు. దీంతో కాలేజీ వద్ద పోలీసు బందోబస్తు కల్పించారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా బెజవాడ లయోలా కాలేజీలో హిజాబ్‌ ధరించడాన్ని ఎందుకు వివాదం చేస్తున్నారని విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments