Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుప‌తిలో న‌వ‌ర‌త్నాల అమ‌లుపై ఉన్న‌త స్థాయి స‌మీక్ష‌

Webdunia
బుధవారం, 7 జులై 2021 (22:37 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కం అమ‌లుపై ఉన్న‌త‌స్థాయి స‌మావేశం ఏర్పాట‌యింది. తిరుపతి ఎస్వీయూ ఆడిటోరియంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం, నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, గృహ నిర్మాణ శాఖ సమీక్షనిర్వ‌హించారు.

సమావేశంలో ఉప ముఖ్య మంత్రి కె.నారాయణస్వామి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాధ రాజు, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ పాల్గొన్నారు. న‌వ‌ర‌త్నాల అమ‌లు ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో జ‌రిగేలా ఉన్న‌తాధికారులు చూడాల‌ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.

పేద‌ల‌కు ఇళ్ళ నిర్మాణంలో అధికారులు చురుకుగా ప‌నిచేయాల‌ని, ఏపీ సీఎం జ‌గ‌న‌న్న కాల‌నీల అభివృద్ధిపై సీరియ‌స్ గా ఉన్నార‌ని గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాధ రాజు అన్నారు. చిత్తూరు జిల్లా స‌మ‌గ్రాభివృద్ధి త‌మ ల‌క్ష్య‌మ‌ని ఉప ముఖ్య మంత్రి కె.నారాయణస్వామి అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments