Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందేళ్ల నుంచి ప్రదర్శిస్తున్న చింతామణి నాటకాన్ని ఎలా నిషేధిస్తారు?

Webdunia
బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (18:55 IST)
ఏపీలో చింతామణి నాటకం నిషేధం వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై వైశ్యులు వేసిన మూడు ఇంప్లీడ్ పిటిషన్లపై అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు. 100 లేక 200 పిటిషన్లు వేస్తారా? అని ప్రశ్నించారు హైకోర్టు న్యాయమూర్తి. 
 
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌‌పై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. విచారణను సాగదీసేందుకే ఇంప్లీడ్ పిటిషన్లు వేస్తున్నారా? అని ప్రశ్నించింది హైకోర్టు.
 
సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించింది హైకోర్టు. అభ్యంతరం ఉన్న పాత్రను మాత్రమే నిషేధించాలని కోరుతున్నామని న్యాయవాది ఉమేష్ చంద్ర వెల్లడించారు. మొత్తము నాటకాన్ని ఎలా నిషేధిస్తారు అని ప్రశ్నించారు ఉమేష్ చంద్ర.
 
కన్యాశుల్కం నాటకంలో అభ్యంతరాలున్నాయని చెబితే మొత్తం నాటకాన్ని నిషేధిస్తారా? అని ప్రశ్నించారు న్యాయవాది. రామాయణంలో అభ్యంతరకర పాత్రలు ఉన్నాయని రామాయణాన్ని నిషేదించమంటే ఎలా అని ప్రశ్నించారు. వందేళ్ల నుంచి ప్రదర్శిస్తున్న నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments