Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ బెయిల్ కోసం మరోమారు హైకోర్టు గడపతొక్కిన లాయర్లు!

Webdunia
బుధవారం, 1 జులై 2015 (10:27 IST)
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ఆయన తరపు న్యాయవాదులు మరోమారు హైకోర్టు గడపతొక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ క్లయింటు రేవంత్ రెడ్డికి ఇచ్చిన బెయిలార్డరులో ఉన్న తప్పులను సవరించి తిరిగి ఆర్డర్ ఇవ్వాలని కోరుతూ, ఆయన తరపు న్యాయవాదులు బుధవారం ఉదయం హైకోర్టులో మెమో దాఖలుచేశారు. 
 
న్యాయమూర్తి దీన్ని పరిశీలించి మరో ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించాల్సిఉంది. ఆ తర్వాత తప్పులు సవరించిన ఆర్డర్ న్యాయవాదుల చేతికి అందాక, దాన్ని చర్లపల్లి జైలు అధికారులకు అందజేస్తేగానీ రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యే అవకాశంవుంది. 
 
లేకుంటే ఆయన మరోరోజు జైల్లో గడపాల్సిరావచ్చు. కాగా, హైకోర్టు ఉత్తర్వుల కాపీలో, ఏసీబీ ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు ఇవ్వాల్సి ఉండగా, ఏసీబీ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లు ఉన్న కారణంగానే మంగళవారం ఆయన విడుదల కాలేకపోయారని రేవంత్‌ తరపు న్యాయవాది సుధీర్‌ కుమార్‌ వివరించారు. టైపింగ్ పొరపాటు వల్లనే ఇది జరిగిందని ఆయన అన్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments