Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం జిల్లాలో గుప్త నిధులు, 10 పురాతన పెట్టెల్లో 15 కేజీల బంగారం

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (12:24 IST)
అనంతపురం జిల్లాలో బుక్కరాయ సముద్రంలో డ్రైవర్ ఇంట్లో తవ్వకాలు జరిపిన పోలీసులు భారీ ఎత్తున దాచియున్న గుప్త నిధిని బయటకు తీసారు. వివరాలిలా వున్నాయి. నాగలింగం అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లోకి అకస్మాత్తుగా వచ్చిన పోలీసులు తవ్వకాలు ప్రారంభించారు. ఆపై 10 పురాతన ట్రంకు పెట్టెలు లభించగా అందులో దాదాపు 15 కిలోల బంగారం ఉంది. దాన్ని కవర్ చేసేందుకు మీడియాను పోలీసులు అనుమతించలేదు.
 
ట్రెజరీ ఆఫీసులో పనిచేస్తున్న మనోజ్ అనే అధికారి వద్ద నాగలింగం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం మనోజ్, నాగలింగంలను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఈ బంగారం విషయంలో ఎన్నో అనుమానాలు తలెత్తుతుండగా నేడో రేపో పోలీసుల నుంచి ప్రకటన రానుంది.
 
ఇంట్లో తవ్వకాల్లో బంగారం దొరకడం ఈ ప్రాంతంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇది హవాలా బంగారమని ఓ ప్రముఖ నేత బినామీ బంగారమని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. కాగా బాలప్ప ఇంట్లో ఆయుధాలు ఉన్నాయని తమకు సమాచారం అందిందని సోదాలకు వెళితే బంగారం దొరికిందని, ఈ విషయాన్ని లోతుగా విచారిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments