Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ ప్రజలను కేంద్రం బిచ్చగాళ్లలా చూస్తోంది: శివాజీ

ఆంధ్రప్రదేశ్ ప్రజలను కేంద్రం బిచ్చగాళ్లలా చూస్తోందని.. నటుడు శివాజీ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షులు అమిత్ షాల పట్ల దేశ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, కర్ణాటకలో బీజేపీ గెలిచి

Webdunia
శుక్రవారం, 11 మే 2018 (09:12 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రజలను కేంద్రం బిచ్చగాళ్లలా చూస్తోందని.. నటుడు శివాజీ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షులు అమిత్ షాల పట్ల దేశ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, కర్ణాటకలో బీజేపీ గెలిచినా బాధపడాల్సిన అవసరం లేదని.. ఎందుకంటే 2019 ఎన్నికల్లో మోదీకి ప్రజలు బుద్ధి చెప్తారని శివాజీ తెలిపారు. 
 
రాష్ట్రంలోని కొన్ని పార్టీలు బీజేపీతో లోపాయికారిగా పనిచేస్తున్నాయని.. వైసీపీ, జనసేనలను ఉద్దేశించి శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీలు హోదా కోసం పోరాడుతున్నట్టు నటిస్తున్నాయన్నారు. ఏపీకి హోదా, విభజన హామీలు అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రాజకీయ పార్టీలు ఏదో నామమాత్రానికి ఉద్యమాలు చేస్తున్నాయని.. నిర్ణయాత్మక ఉద్యమాలు చేయట్లేదన్నారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని.. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఏపీకి రాజధాని లేకుండా, ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీ లేకుండా కాంగ్రెస్ ఇచ్చిందని, మేం న్యాయం చేస్తామని చెప్పిన బీజేపీ కూడా కొంపముంచిందని శివాజీ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments