Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త చనిపోయాడు, 13 ఏళ్ల నుంచి ప్రియుడితోనే, అర్థరాత్రి ఆ పని చేసిపోయాడు

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (20:43 IST)
భర్త అనారోగ్యంతో చనిపోయాడు. అయితే ఇక అక్కడ ఉండలేక తన 13 యేళ్ళ కుమారుడితో కలిసి వేరే ప్రాంతానికి వలస వెళ్ళింది. అక్కడ కూలీ పనిచేసుకుంటూ ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కానీ ఉన్నట్లుండి అతని చేతిలోనే దారుణ హత్యకు గురైంది.
 
నందనవనం సమీపంలోని ఇంద్రసేనారెడ్డి నగర్ బస్తీ ప్రాంతమది. ఉన్నట్లుండి అరుపులు, కేకలు. తన తల్లి చనిపోయిందంటూ కొడుకు బయటకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
 
రంగంలోకి దిగారు పోలీసులు. మహిళది దేవరకొండ ప్రాంతంగా గుర్తించారు. తన భర్త అనారోగ్యంతో చనిపోతే 13 సంవత్సరాల క్రితం ఇంద్రసేనారెడ్డి నగర్ బస్తీకి వచ్చినట్లు గుర్తించారు. ఇక్కడకు వచ్చిన వెంటనే శ్రీకాంత్ అనే వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందట.
 
ఈ విషయం స్థానికులందరికీ తెలుసు. అయితే శ్రీకాంత్ మద్యానికి బానిస. బాగా ఫుల్లుగా తాగి రోజూ ఇంటికి రాత్రిపూట వెళ్ళేవాడు. అర్థరాత్రి సమయంలో ఇద్దరి మధ్యా గొడవ జరిగి ఆమెను గొంతు నులిమి చంపేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
 
తల్లి ఎంతకూ లేవకపోవడంతో కొడుక్కి అనుమానం వచ్చి స్థానికులకు చెప్పాడు. హత్యగా భావించి వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రియుడు శ్రీకాంత్‌ను విచారిస్తే తనకేమీ సంబంధం లేదంటున్నాడు. రాత్రి సమయంలో శ్రీకాంత్ తప్ప వేరే వ్యక్తి లేకపోవడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments