Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త చనిపోయాడు, 13 ఏళ్ల నుంచి ప్రియుడితోనే, అర్థరాత్రి ఆ పని చేసిపోయాడు

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (20:43 IST)
భర్త అనారోగ్యంతో చనిపోయాడు. అయితే ఇక అక్కడ ఉండలేక తన 13 యేళ్ళ కుమారుడితో కలిసి వేరే ప్రాంతానికి వలస వెళ్ళింది. అక్కడ కూలీ పనిచేసుకుంటూ ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కానీ ఉన్నట్లుండి అతని చేతిలోనే దారుణ హత్యకు గురైంది.
 
నందనవనం సమీపంలోని ఇంద్రసేనారెడ్డి నగర్ బస్తీ ప్రాంతమది. ఉన్నట్లుండి అరుపులు, కేకలు. తన తల్లి చనిపోయిందంటూ కొడుకు బయటకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
 
రంగంలోకి దిగారు పోలీసులు. మహిళది దేవరకొండ ప్రాంతంగా గుర్తించారు. తన భర్త అనారోగ్యంతో చనిపోతే 13 సంవత్సరాల క్రితం ఇంద్రసేనారెడ్డి నగర్ బస్తీకి వచ్చినట్లు గుర్తించారు. ఇక్కడకు వచ్చిన వెంటనే శ్రీకాంత్ అనే వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందట.
 
ఈ విషయం స్థానికులందరికీ తెలుసు. అయితే శ్రీకాంత్ మద్యానికి బానిస. బాగా ఫుల్లుగా తాగి రోజూ ఇంటికి రాత్రిపూట వెళ్ళేవాడు. అర్థరాత్రి సమయంలో ఇద్దరి మధ్యా గొడవ జరిగి ఆమెను గొంతు నులిమి చంపేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
 
తల్లి ఎంతకూ లేవకపోవడంతో కొడుక్కి అనుమానం వచ్చి స్థానికులకు చెప్పాడు. హత్యగా భావించి వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రియుడు శ్రీకాంత్‌ను విచారిస్తే తనకేమీ సంబంధం లేదంటున్నాడు. రాత్రి సమయంలో శ్రీకాంత్ తప్ప వేరే వ్యక్తి లేకపోవడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments