Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (06:26 IST)
హెల్మెట్ ధారణను రోడ్డు రవాణా సంస్థ తెలంగాణలో కఠినతరం చేయనున్నది. నేటి నుంచి ద్విచక్రవాహనం నడిపేవారు హెల్మెట్ ధరించి తీరాల్సిందేననే నిబంధనను అమలు చేయనున్నారు. ఈ విషయమై అంతర్గతంగా అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులకు గురువారం కమిషనర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ద్విచక్ర వాహనంతో పాటే ఐఎస్‌ఐ మార్కు ఉన్న హెల్మెట్ కూడా డీలర్లు విక్రయించేలా చర్యలు తీసుకోనున్నారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల వరకు వాహనాలు ఉన్నాయి. ఇందులో 80 శాతం పైగా ద్విచక్ర వాహనాలే. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజూ వేయి వరకు ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రర్‌ అవుతున్నాయి. ఇక నుంచి వీరంతా బైక్‌తోపాటు హెల్మెట్‌ కొనాల్సిందే. వివిధ కారణాలు, అపోహలతో చాలామంది హెల్మెట్లు వాడటం లేదు. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు తలకు దెబ్బ తగిలి మృత్యువాత పడుతున్నారు. ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించటానికి శిరస్త్రాణాల వినియోగం తప్పనిసరి చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. 
 
పాత వాహనదారులు కూడా శిరస్త్రాణాలు కొనుగోలు చేయాలి. ఇప్పటికే వాహనం కొని ఇంకా రిజిస్ట్రేషన్‌ చేయించుకోని వారు...ఐఎస్‌ఐ మార్కు ఉన్న హెల్మెట్‌ కొని ఆ బిల్లును చూపిస్తేనే రిజిస్ట్రేషన్‌ చేస్తామని హైదరాబాద్‌ నగర జేటీసీ రఘునాథరావు తెలిపారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments