Webdunia - Bharat's app for daily news and videos

Install App

7వ తేదీ నుంచి శాంపిల్ పుష్కరాలు: ఏపీ సర్కారు నిర్ణయం

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2015 (10:43 IST)
గోదావరి పుష్కర ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూడాలన్న ఉద్దేశంతో నమూనా పుష్కరాలను నిర్వహించాలని, పుష్కర సమయాల్లో ఎలాంటి చర్యలుంటాయో, వాటినన్నంటినీ ట్రయల్ వేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. వచ్చే నెలలో గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో 7వ తేదీ శాంపిల్ పుష్కరాలు జరుగనున్నాయి. రోజూ గోదావరి నదికి హారతివ్వడం నుంచి, నదీ కరకట్టల వెంబడి బాణసంచా వేడుకల వరకూ ట్రయల్ వేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. 
 
25వ తేదీన తాను రాజమండ్రిలో పర్యటిస్తానని, ఆ సమయానికి నమూనా పుష్కరాలకు సంబంధించిన పనులు పూర్తి కావాలని బాబు ఆదేశించారు. కడియం నర్సరీ పూలతో అలంకరణ, అన్ని రకాల వంటకాలతో కూడిన ప్రదర్శనలు, భద్రత నిమిత్తం సీసీ కెమెరాల ఏర్పాటు తదితరాలను చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. పుష్కరాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఆటలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని ఆదేశించారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments