Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగ్గుమంటున్న తెలుగు రాష్ట్రాలు: అత్యధిక ఉష్ణోగ్రత 42.4 డిగ్రీలు నమోదు..

తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటివరకు 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు భారీగానే నమోదు అవుతున్నాయి. తిరుపతిలో 43.3డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతల

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (13:32 IST)
తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటివరకు 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు భారీగానే నమోదు అవుతున్నాయి. తిరుపతిలో 43.3డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం పూట గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా సాధారణ ఉష్ణోగ్రతల కన్నా మరో 4డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగవచ్చునని పేర్కొంది. 
 
ఎండలకు తాళలేక చాలామంది ఇంటికే పరిమితమవుతుండగా, మరోవైపు పంటలకు భారీ నష్టం తప్పట్లేదు. నీటి కొరత, ఎండ వేడిమికి పంటలు ఎండిపోతున్నాయి. శనివారం నాడు ఎండ వేడి తట్టుకోలేక వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో భక్తులు సమర్పించిన రెండు కోడెలు మృతి చెందాయి. గడిచిన 25రోజుల్లో మొత్తం 15ఎద్దులు మృత్యువాత పడినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
 
అత్యధిక వేడి వడగాలుల కారణంగా పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారు. ద్విచక్ర వాహనదారులు బయటకు వెళ్లాలంటే జడుసుకుంటున్నారు.  అవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్‌లో 43 డిగ్రీలు, నిజామాబాద్‌లో 42, భద్రాచలం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండలో 41, హైదరాబాద్, హన్మకొండలో 40, ఖమ్మం, హకీంపేటలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments