Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొంచివున్న వాయుగుండం ముప్పు

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (14:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాయుగుండం ముప్పు పొంచివుంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలపడి ఆదివారం నాటికి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ అదే రోజు రాత్రి చెన్నైకు తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. 
 
ఈ వాయుగుండం ప్రభావం కారణంగా రానున్న 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత అది క్రమంగా అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేసింది. 
 
ఈ వాయుగుండం చెన్నై - నెల్లూరు ప్రాంతాల మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో సోమ, మంగళవారాల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాతీర ప్రాంతాలైన శ్రీహరికోట, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, రాయలసీమలోని చిత్తూరు, కడప, అన్నమయ్య వంటి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments